ఎంపీని కలిసిన ఐఎన్టియుసి ఓబీ యూనియన్ నాయకులు

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో పార్లమెంట్ మెంబర్ రామ సహాయం రఘ రామ్ రెడ్డి ని బుధవారం కొత్తగూడెం క్లబ్ లో డిసిసి నూతన అధ్యక్షుల ఆశావాహుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎంపీ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు ఓబి కార్మికులు కలిసి శాలువాతో సత్కరించారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 5500 బోనస్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, కాంట్రాక్టు కార్మికుల ఓబీ ప్రెసిడెంట్ జెట్టి మోహన్, వైస్ ప్రెసిడెంట్ బూరుగు సతీష్, జాయింట్ సెక్రటరీ జోగు ప్రదీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కసనబోయిన రామ్మూర్తి, సీనియర్ నాయకులు దామోదర్, మాదాసు శ్రీనివాస్ దాసరి రమేష్, తుంగ రాజు, అజ్మతుల్లా అజీమ్ ఆదినారాయణ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.