సిఅండ్ఎండికి శుభాకాంక్షలు తెలిపిన సీతారాములు

సింగరేణి : సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన బలరాం నాయక్ కు శాలువాతో సన్మానం చేసి పూల మొక్కను బహుకరించి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సింగరేణి సంస్థ నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కింది స్థాయి నుండి ఐఆర్ఎస్ అధికారిగా ఎదిగిన బలరాం నాయక్ ద్వారా సింగరేణి కార్మికులకు, సింగరేణి సంస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు.