మత్తుకు బానిసలై భవిష్యత్తు పాడు చేసుకోవద్దు

  • డిఎస్పీ ఆదినారాయణ

కొత్తగూడెం :  పట్టణ పరిధిలో  గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులకు  తల్లిదండ్రుల సమక్షంలో  వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తగూడెం టౌన్ తో పాటు చుంచుపల్లి లక్ష్మీదేవి పల్లి పోలీస్ స్టేషన్ లో పలు సందర్భాల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడి కేసులను నమోదు అయిన యువకులను పిలిపించి వారి తల్లిదండ్రుల సమక్షంలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని డిఎస్పి నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై యువకులు తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకొని తమ తల్లిదండ్రులకు,తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారి సారధ్యంలో ఇకపై కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరంతరం గస్తీని పెంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా అక్రమంగా గంజాయి సరఫరా చేస్తునట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోపంగా ఉంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం వన్టౌన్ సిఐ కరుణాకర్,  టూ టౌన్ సిఐ ప్రతాప్, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్ల,త్రీటౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading