ఐఎల్పిఎ క్యాలెండర్ ఆవిష్కరణ
- ప్రజలను చైతన్యపరచడంలో అగ్రగామిగా ఐఎల్పిఎ
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టులో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పిఎ) క్యాలెండర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఈ సంస్థకు పునాది అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవానికి అర్హుడని, ఐఎల్పిఎ ఈ విలువలను సమాజంలో విస్తరించేందుకు పాటుపడుతోంది అన్నారు. జనవరి 3న విద్యా తల్లి సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ప్రాశస్త్యమైందన్నారు. ఇది విద్యా విప్లవానికి ఇచ్చే గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయబద్ధతను ప్రజల్లో చైతన్యం చేయడంలో ఐఎల్పిఎ అగ్రగామిగా ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ఈ సంస్థ స్ఫూర్తిదాయకంగా పనిచేస్తోందన్నారు. సమాజంలో అన్ని వర్గాల మనుషులు సమాన హక్కులు పొందాలన్న లక్ష్యంతో ఐఎల్పిఎ నిరంతరం ముందుకు సాగుతోంది అని అభినందించారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీమతి భానుమతి , శ్రీ రామారావు , శ్రీమతి సాయి శ్రీ హాజరయ్యారు. అలాగే, %IూూA% ప్రతినిధులు సీనియర్ న్యాయవాది వివి సుధాకర్ రావు , మహిళా న్యాయవాది భానుప్రియ , గాజుల రామ్మూర్తి , జే గోపికృష్ణ , బండ్ల రాజశేఖర్ గారు, నరసింహ చారి , సాదిక్ పాషా , మారపాక రమేష్ కుమార్ , వడ్లకొండ హరిప్రసాద్ , దొడ్డ సామంత్ , వై.వై. నాయుడు , అంకుష్ పాషా , రాధాకృష్ణ , జింక మన్మోహన్ , రామారావు తదితర సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.