అత్యంత పేదలకే డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు

  • జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కొత్తగూడెం : పేదలలో అత్యంత నిరుపేదలకు మాత్రమే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు మంజూరు అవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.  డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ జిల్లాలో నెలకొన్న భూ సమస్యలపై ఆర్డీవోలు, జిల్లా అధికారులు జిల్లాలోని అందరు తాసిల్దారుల తో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ, అశ్వరావుపేట, చర్ల మండలాల్లో డేటా ఎంట్రీ పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు.

కరకగూడెం, చర్ల మండలాలు ఆరు మూల ప్రాంతాల్లో ఉండటం, విద్యుత్‌ అంతరాయం, నెట్వర్క్‌ సమస్య , డేటా ఎంట్రీ ఆపరేటర్లు కొరత ఉన్నందువలన బూర్గంపాడు మండలం డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కరకగూడెం, చర్ల మండలం డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టాలని, భద్రాచలం ఆర్డీవోని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.జిల్లాలో పూర్తి అయిన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు లబ్ధిదారులు ఎంపిక కు తాసిల్దారులు అందరూ క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలలో పర్యటించి పేదలలో అత్యంత పేద వాళ్లకు మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలతో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులు, గుడిసెలలో జీవనం సాగిస్తున్న వారిని గుర్తించాలన్నారు.

తాసిల్దారులందరూ ఈరోజు తమ పరిధిలోడికి వచ్చిన దరఖాస్తులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పేదవారిని గుర్తించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. తాసిల్దారులు గుర్తించిన పేదవారిని ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో విచారించి తుది జాబితా సిద్ధం చేయాలని కొత్తగూడెం భద్రాచలం ఆర్డీవో లను ఆదేశించారు.లబ్ధిదారుల ఎంపికలో అధికారులు ఉద్యోగస్తులు ఎటువంటి పైరవీలు లేదా అవకతవకలకు పాల్పడిన ఉపేక్షించేది లేదు అని కలెక్టర్‌ హెచ్చరించారు.

 

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading